జీవితమే అనుభూతుల విందు!
జీవితమే అనుభూతుల విందు! -శృంగవరపు రచన క థల ప్రయోజనం లోతైన అర్ధాల్లో ఏదైనా కావచ్చు కానీ జీవితంలో సంతోషమో లేదా దుఃఖమో ఏమున్నా సరే , మనకే తెలియని మనకు సంతోషాన్ని కలిగిస్తూ కొంత నవ్వును ముఖం మీద జమయ్యేలా చేసే కథలకు లోతైన విశ్లేషణలు అవసరం లేదు ఎందుకంటే అవి గొప్ప అనుభూతుల భాండాగారాలు కనుక! జీవితంలో మధుర స్మృతుల గురించి , కొన్ని అంశాలను తలచుకోగానే హాస్యం , సంతోషం , జీవితానికి ఇది చాలు అనే భావాన్ని కలిగించే కథలే నేతి సూర్యనారాయణ శర్మ గారి ‘ శ్రీ దోస గీత ’ కథలు. ఇందులో మొత్తం 18 కథలున్నాయి. మనిషి జీవితంలోని ప్రతి అంశాన్ని ఎంత సున్నితంగా , హాస్యంగా చూస్తూ , జీవితంలో సంతృప్తి పొందవచ్చో అన్న అంశాన్ని స్పష్టం చేసే కథలు ఇవి. ‘ భారతంలో పాఠోలి ’ కథలో పాఠోలి వంట ఎలా భీముడు వండాడో , దానికున్న సందర్భం ఏమిటో అన్న అంశాన్ని ఎంతో హాస్యంగా , వంటకు మన జీవితంలో ఉన్న పాత్రను స్పష్టం చేస్తూ రాశారు. ఇందులో కథల్లో కొన్ని జిహ్వాకు సంబంధిం