ఎంతెంత దూరం!
చదువరి ఎంతెంత దూరం! -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) రతన్ ప్రసాద్ గారి ‘ తెర తొలిగింది ’ నవలలో బిడ్డను సహజంగా ప్రేమించగలిగే స్త్రీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డను ద్వేషిస్తూనే ఆ బాధ్యత తీసుకుంటుందో , ఆ తర్వాత ఆమె చూపించిన నిర్లక్ష్యం వల్ల ద్వేషం పెంచుకున్న ఆ కొడుక్కి , ఆ తల్లికి మధ్య ఎప్పుడు ఆ తెర తొలిగిందో అన్న అంశంతో కుటుంబ కథగా మలిచారు. సురమౌళి రాజేశ్వరి అనే కోటీశ్వరురాలి కొడుకుగా పుట్టినా , పార్వతి అనే ఆయా సంరక్షణలో ఎనిమిదేళ్ళు పెరుగుతాడు. తల్లి తన పట్ల కఠినంగా ఉండటం , తనకు సౌకర్యాలు అందించినా , తనకు ఇష్టమైనవి ఇవ్వకపోవడం , తనతో ప్రేమగా ఉండకపోవడం వంటివి అతని మనసులో తల్లిపట్ల ద్వేషాన్ని పెంచుతాయి. తర్వాత అతని వినీలను ప్రేమిస్తే ఆమె కాదన్నదన్న కారణానికి అప్పటికే మనసులో ఉన్న ద్వేషం కూడా తోడవ్వడంతో ఆమెను వదిలి వెళ్ళిపోతాడు. రాజేశ్వరి చావుబతుకుల్లో ఉందని టెలిగ్రామ్ అందినా వెంటనే బయల్దేరడు. చివరికి మిత్రుడు మురలి బలవంతం మీద వెళ్ళినా ఆమె ఆపాటికే మరణిస్తుంది. బాల్యం నుండి ఆమె మీద ఉన్న ద్వేషం సురమౌలికి ఆమె మరణంతో కూడా పోదు. ఆమె చనిపోయ