మారుతున్న మాంగల్యబంధాలు
మారుతున్న మాంగల్యబంధాలు -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) పెళ్ళి చేసుకునేముందు నేడు యువత ఎంతగానో ఆలోచిస్తున్నారు. పెళ్ళి అంటే ఒకరితో జీవితాంతం కలిసి ఉండటం , వారి బాధ్యతల్లో , బాధల్లో పాలుపంచుకోవడం , వారితో ప్రేమతో జీవనం సాగించడం. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి మార్పుకు గురి కావాల్సిందే. అలాగే ఈ వివాహ వ్యవస్థ కూడా చాలా మార్పులకు గురి అయ్యింది. నేడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తూ సమిష్టిగా సంతోషంగా జీవించే సంస్కృతి నేడు దాదాపు ఉంది. ఇద్దరు కలిసి ఉండాలంటే అది కూడా జీవితాంతం కచ్చితంగా వారి వ్యక్తిగత జీవితాలు భాగస్వామికి కూడా చెందుతాయి. దీనిని పూర్వం ప్రేమ అనే అనుకునేవారు దంపతులు. కానీ నేడు తమ స్పేస్ తమకు ఉండడం లేదని తమ జీవితంలోని అన్నీ విషయాల్లో భాగస్వామి పెత్తనం చేస్తున్నారనే ఫిర్యాదు అటు భార్యల నుంచి , ఇటు భర్తల నుంచి కూడా వినిపిస్తూనే ఉంది. దీనికి కారణాలు మనం ఆలోచిస్తే ఈ ప్రైవసీ తో పాటు ఇంకేన్నో కారణాలు కూడా ఉన్నాయి.భార్యాభర్తల మధ్య విశ్వసనీయత లోపిస్తే కూడా అది వారి వివాహం విచ్చిన్నానికి దారి తీస్తుంది. ఒకరి విషయాలు ఇంకొకరితో పం