నోట్లతో రద్దయిన జీవితాలు
నోట్లతో రద్దయిన జీవితాలు -శృంగవరపు రచన సామాజిక అంశాల మీద కవిత్వం , కథలే తప్ప నవలా సాహిత్యం అరుదుగానే వెలువడుతుంది.ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే సందర్భ రచనల శైలి కూడా కొందరు రచయితలకే పరిమితమయ్యింది.పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రజల జీవితాన్ని ముఖ్యంగా ఓ మధ్య తరగతి కుటుంబాన్ని ఎలా ధ్వంసం చేసిందో స్పష్టం చేసే నవలే మెట్టు మురళీధర్ గారి ‘ ఆ యాభై రోజులు. ’ సమాజంలో మార్పును సూచించే ఏ ప్రభుత్వ నిర్ణయమైనా ముందుగా పేద , మధ్య తరగతి వర్గాల మీదే తన దుష్ప్రభావాలను చూపిస్తుంది. 2016 నవంబర్ 8 రాత్రి ప్రభుత్వం నల్లధనాన్ని నిర్మూలించాలని తీసుకున్న నిర్ణయం , ఎందరి జీవితాలనో కూల్చి వేసింది. మనుషుల్లో డబ్బుతనమే తప్ప మనిషితనం లేదా అన్న ప్రశ్నకు లేదు అనే సమాధానమే నాడు ఆ నిర్ణయం నేడు సమకాలీనంగా కోవిడ్ కూడా స్పష్టం చేసింది. మనిషిలోని ఆ డబ్బుతనమే కొందరికి అవకాశాలను సమస్యల్లో సృష్టిస్తుంది . మనుషుల్లోని నిస్సహాయతను ఆ డబ్బుతనానికి పెట్టుబడిగా మార్చి , కోలుకోలేని దెబ్బలు వేస్తుంది.అలా ధ్వంసమై మరలా చిగురించాలనే ఆశతో ఉన్న కుటుంబ కథను వస్తువుగా మలి