ఏది ఊతం ?
చదువరి ఏది ఊతం ? -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) మనిషి జీవితంలో జరిగే ప్రతి సంఘటన మనిషి అవగాహనకు , మనిషి అంచనాలకు అందకుండా జరిగిపోతూ ఉంటుంది. జీవితంలో ఒక్కో పరిస్థితి ఒక్కోసారి భయపెట్టినా సరే ఆ తర్వాత జీవితంలో అదే పరిస్థితి మనిషిలోని గట్టిదనానికి , ధైర్యానికి ఊతాన్నిస్తుంది. అలా తన జీవితం గురించి సుందరి చెప్పడంతో మొదలవుతుంది స్వాతి శ్రీపాద గారి ‘ ఎక్కడినుంచి ...ఇక్కడిదాకా.. ’ నవల. కొన్ని నవలలలో మలుపులు వాస్తవిక జీవితంలో తలెత్తే ఆటంకాల నుండే జన్మిస్తాయి. మనిషి జీవితం చుట్టూ ఒక్కోసారి సంతోషాన్నిచ్చే , ఇంకొక్కసారి దుఃఖంతో నింపే సంఘటనలు మనుషుల ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండా జరిగిపోతునే ఉంటాయి. అటువంటి జీవితమే సుందరిది కూడా. సుందరి తల్లి సీతారత్నం. ఆమె కుటుంబం కూడా పెద్దది. ఆమె మేనత్తకు పిల్లలు లేకపోవడంతో పెద్దన్నను పోరి మరి తనతో దత్తత కాకపోయినా పెంచుకోవడానికి తీసుకువెళ్తుంది. తీసుకువెళ్లే ముందే తన ఇంటిని తన తదనంతరం సీత పేరు మీద రాసి మరి ఆమెను తన ఇంటికి తీసుకువెళ్తుంది. సీతకు సంగీతంతో పాటు చదువు కూడా చెప్పిస్తుంది.కానీ రెండేళ్ల తర్వాత మేనత్త ఆరోగ్యం దెబ్బ తిన