భర్తలు బలిపశువులా?
చదువరి -1: భర్తలు బలిపశువులా? (సెక్షన్ 494 ఎవరికీ ఆయుధం ?) -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) నేడు న్యాయ వ్యవస్థలో స్త్రీలకు రక్షణగా ఎన్నో చట్టాలు వచ్చాయి. వీటిల్లో ఎన్నో చట్టాలను స్త్రీలు తమ వ్యక్తిగత కక్ష సాధింపు చర్యల కోసం దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు కూడా చూస్తూనే ఉన్నాం. ఎప్పటిదో ఆంధ్రభూమి సంచికలో ప్రచురించబడిన మినీ నవల సెక్షన్ 494 చదవడం జరిగింది. వ్యక్తిగతంగా ఆలోచిస్తే నేను ఆ రచయిత అభిప్రాయంతో పూర్తిగా విభేదిస్తాను. సెక్షన్ 494 అనే నవలికను విజయార్కే రచించారు. కథాంశంలో హారిక అనే అమ్మాయి ప్రసాద్ ను ప్రేమించి తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకుంటుంది. హారిక కుటుంబం సహృదయంతో ఆమెను అర్ధం చేసుకుంటారు. కొంతకాలానికి ప్రసాద్ ప్రవర్తనలో మార్పు రావడం గమనిస్తుంది హారిక. తన తండ్రిని డబ్బు పంపమని అడగటం, మాయ అనే అమ్మాయితో చనువుగా ఉండటం గమనిస్తుంది. అదే విషయం అతన్ని అడిగితే ఆమె తండ్రి వ్యాపారం మొదలు పెడుతున్నాడని, మాయతో మంచిగా ఉంటే తనకు పార్టనర్ షిప్ కూడా దక్కుతుందని చెప్తాడు. ఓ సారి తాను ముంబై ఉద్యోగం పని మీద వెళ్తున్నానని ఆమెను పుట్టింటికి పంపుతాడు. ప్రసాద్ ,హరికల పెళ్లి జరిపించిం