భర్తలు బలిపశువులా?

చదువరి -1: 
భర్తలు బలిపశువులా? 
(సెక్షన్ 494 ఎవరికీ ఆయుధం ?)
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
 


నేడు న్యాయ వ్యవస్థలో స్త్రీలకు రక్షణగా ఎన్నో చట్టాలు వచ్చాయి. వీటిల్లో ఎన్నో చట్టాలను స్త్రీలు తమ వ్యక్తిగత కక్ష సాధింపు చర్యల కోసం దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు కూడా చూస్తూనే ఉన్నాం. ఎప్పటిదో ఆంధ్రభూమి సంచికలో ప్రచురించబడిన మినీ నవల సెక్షన్ 494 చదవడం జరిగింది. వ్యక్తిగతంగా ఆలోచిస్తే నేను ఆ రచయిత అభిప్రాయంతో పూర్తిగా విభేదిస్తాను. 
సెక్షన్ 494 అనే నవలికను విజయార్కే రచించారు. కథాంశంలో హారిక అనే అమ్మాయి ప్రసాద్ ను ప్రేమించి తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకుంటుంది. హారిక కుటుంబం సహృదయంతో ఆమెను అర్ధం చేసుకుంటారు. కొంతకాలానికి ప్రసాద్ ప్రవర్తనలో మార్పు రావడం గమనిస్తుంది హారిక. తన తండ్రిని డబ్బు పంపమని అడగటం, మాయ అనే అమ్మాయితో చనువుగా ఉండటం గమనిస్తుంది. అదే విషయం అతన్ని అడిగితే ఆమె తండ్రి వ్యాపారం మొదలు పెడుతున్నాడని, మాయతో మంచిగా ఉంటే తనకు పార్టనర్ షిప్ కూడా దక్కుతుందని చెప్తాడు. ఓ సారి తాను ముంబై ఉద్యోగం పని మీద వెళ్తున్నానని ఆమెను పుట్టింటికి పంపుతాడు. 
ప్రసాద్ ,హరికల పెళ్లి జరిపించింది ప్రసాద్ ,హారికల స్నేహితుడైన మధు. హారికను చెల్లిగా భావిస్తాడు. అంతే కాకుండా హారిక తండ్రి రామం మాస్టారుకు శిష్యుడు కూడా. రామం మాస్టారు ఇంటికి వచ్చిన మధు హారికను చూసి అడిగితే, ఉద్యోగం పని మీద ముంబై వెళ్తూ తనను పుట్టింటికి పంపాడని చెప్తుంది. తను ప్రసాద్ ,మాయాలను  హోటల్ లో చూశానని చెప్తాడు. అలా మధు ఎంక్వైరీ చేస్తే ప్రసాద్ మాయను వివాహం చేసుకున్నాడని తెలుస్తుంది. దానితో ఏం చేయాలో పాలుపోక హరికా ఆత్మహత్య చేసుకోవాలని హుస్సేన్ సాగర్ లో దూకుతుంది. అదే సమయంలో అక్కడ ఉన్న జర్నలిస్ట్ స్టెల్లా, లాయర్ కార్తీక్ ఆమెను కాపాడతారు. ఆమె నుండి విషయం తెలుసుకుని ఆమెను ఇంటికి చేర్చుతారు. 
స్టెల్లా ,కార్తీక్ ఆమెకు న్యాయం జరగడానికి సెక్షన్ 494 ప్రకారం అతనికి శిక్ష పడేలా చేయవచ్చని చెప్తారు. మొదటి భార్య ఉండగానే ప్రసాద్ రెండో వివాహం చేసుకున్నాడని వారి సలహాపై హారిక తండ్రి ప్రోత్సాహంతో కేసు పెడుతుంది. ఈ 494 సెక్షన్ ప్రకారం మూడు విషయాలు బాధితురాలు నిరూపించాల్సి ఉంటుంది. మొదటి అంశం తనకు అతనితో వివాహం జరిగిందని నిరూపించాలి. రెండవది అతనికి రెండో వివాహం జరిగిందని నిరూపించాలి. మూడవ అంశం తనకు విడాకులు ఇవ్వలేదని కూడా నిరూపించాలి. 
అందులో మొదటి అంశంగా మధు వారి పెళ్లప్పుడు తీసిన ఫోటోలు ద్వారా సాధ్యమవుతుంది. కానీ మాయ,ప్రసాద్ ల పెళ్లి అయినట్టు ఎక్కడ సాక్ష్యాలు దొరక్కపోవడంతో గడువులు అడుగుతూ ఉంటాడు హారిక తరపున వాదిస్తున్న కార్తీక్. చివరకు తనకు న్యాయం జరగదని అర్ధం అయిన హారిక స్లీపింగ్ పిల్స్ మింగి ఆత్మహత్య చేసుకుంటుంది.ఆమెశవాన్ని కోర్టులో హాజరు పరచి కార్తీక్ బాధితురాలి ఆవేదననే సాక్ష్యంగా భావించేలా సెక్షన్ 494 ను సవరించాలని వేడుకోవడంతో నవలిక ముగుస్తుంది. అప్పుడే స్త్రీలకు న్యాయం జరుగుతుందని  రచయిత ముగిస్తారు. 
స్త్రీలకు అన్యాయం జరుగుతుందని ఆలోచించే మనుషులు పురుషుల కనీస హక్కుల్ని మాత్రం స్త్రీ సాధికారత పేరిట ఎందుకు కాలరాసిన పర్వాలేదు అని భావిస్తున్నారు? ఓ ప్రజాస్వామ్య దేశంలో మనం నివసిస్తున్నప్పుడు మనందరికీ మనుషులుగా సమాన హక్కులు ఉన్నాయని చెప్పుకుంటూనే, స్త్రీలకు అధిక ప్రాధాన్యత కావాలని కోరుకోవడం తప్పు కాదా? ఒకవేళ పై నవలలో చెప్పినట్టు సాక్ష్యాలను అనుసరించి కాకుండా కేవలం స్త్రీ ఆవేదననే సాక్ష్యంగా పరిగణిస్తే కచ్చితంగా ఇప్పుడు అత్తా,మామలను,భర్తను సెక్షన్ 498 ఏ పేరుతో వేధిస్తున్న సంఘటనలు అధికం.ఇక ఏ సాక్ష్యం లేకుండా కేవలం ఆవేదననే పరిగణిస్తే కచ్చితంగా ఇది కూడా దుర్వినియోగానికే గురవుతుందనడంలో సందేహం లేదు. 
ఈ సాంకేతిక యుగంలో ప్రతి దానికి ఓ సాక్ష్యం ఉంటుంది. పెళ్లి లాంటి పెద్ద విషయాన్ని దాచే ప్రయత్నం చేయరు కూడా ఎవరు. కనుక న్యాయం విషయంలో  మనుషులందరినీ ఒకేలా పరిగణించాలి తప్ప స్త్రీలు కనుక వారి వైపు న్యాయం ఉంటుందని పురుషుల హక్కుల్ని కాలరాయడం మాత్రం అన్యాయం. నేడు స్త్రీ సమానత్వం పేరిట కూడా పురుషుల హక్కుల్ని కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా చట్టం ముందు అందరూ సమానులే ! 
                                 *      *     *  

Comments

  1. Replies
    1. ధన్యవాదాలు సుదర్శన్ గారు ....

      Delete
  2. భర్తల దాష్టీకానికి బలైపోయిన వర్గంగా భావించిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రత్యేక చట్ట చర్యలద్వారా రక్షణ కల్పించటం, అభినందనీయమైన చర్యే కాక దానిపట్ల భిన్నభావాలు కలవారు , ప్రజాస్వామికప్రభుత్వాల చర్యలపట్ల నమ్మకము లేనివారై చట్టాలపట్ల అపనమ్మకం కలిగిస్తూ సమాజములో అపోహలకు దారితీసే వ్రాతలు చట్టప్రకారం శిక్షర్హము.

    ReplyDelete
    Replies
    1. ఏ వ్యాఖ్యను తీసేసారు ?.

      Delete
    2. మీకు సమాధానం ఇవ్వడం జరిగింది. కింద ఉంది గమనించగలరు. అది సాంకేతిక వైఫల్యం వల్ల జరిగింది.

      Delete
  3. Replies
    1. మీరు నేను రాసిన ఆర్టికల్ ను సరిగ్గా అర్ధం చేసుకుంటే ,నేను ప్రజాస్వామ్య భారతంలో చేసిన చట్టాన్ని సమర్ధించాను ,కానీ దానిలో సవరణలు చేయాలని వ్యక్తిగతంగా చేసిన ప్రతిపాదనను ఖండించాను. సుప్రీం కోర్ట్ సైతం 498 ఏ చట్టం దుర్వినియోగానికి గురి అవుతుందని 2014 లో పేర్కొంది . నేను ధృవీకరించబడిన నిజాలనే రాశాను. భర్తల దాష్టీకానికి గురయ్యే భార్యల గురించి చేసిన చట్టం అటు పురుషులకు, స్త్రీలకు ఇద్దరకు న్యాయం జరిగేలా రూపొందించబడింది. అది సహేతుకం ,కానీ కేవలం కొందరు పక్షపాత ధోరణితో సాక్ష్యాలు లేకపోయినా సరే కేసు స్త్రీ వైపు ఉండేలా సవరణలు కోరడం న్యాయం కాదు. నేను చెప్పింది గూగోల్ లో ఉంది ,దుర్వినియోగం అవుతుందని ,మన సర్వోన్నత న్యాయస్థానం 498 ఏ గురించి చెప్పింది నేను పేర్కొనడం ఎలా తప్పు అవుతుంది ? అన్యాయం జరిగినప్పుడు ప్రశించే హక్కు ఎందుకు లేదు ? ఇది అపనమ్మకం కలిగించడం ఎలా అవుతుంది ? జరిగినవే నేనే పేర్కొంటే?మీరు సెక్షన్ 494 నవలిక చదివారా ?ఏది అపోహో మీరే తెలియజేయండి . జరిగిన నిజాలకు సాక్ష్యంగా పురుషుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న సంఘాల గురించి ,అలాగే ఈ పురుషుల హక్కుల కోసం పోరాడుతున్న దీపికా నారాయణ్ భరద్వాజ్ గారి పోరాటం గురించి కూడా మీరు పరిశోదిస్తే నేను రాసిన ప్రతి అంశానికి సాక్ష్యాలు మీకు కనిపిస్తాయి .ముందు నేను ప్రభుత్వం చేసిన చట్టాల గురించి ఖండించలేదు ,వ్యక్తిగత వాదాల పేరుతో జరుగుతున్న అన్యాయ్యాన్ని సూటిగా ప్రశ్నించాను .మీరు నేను పైన పేర్కొన్న అంశాలను చెక్ చేస్తే ,నేను రాసిన ప్రతి దానికి సాక్ష్యం కనిపిస్తుంది .నిజాన్ని రాసే హక్కు రచయితకు ఉంది. దానిని ఖండించే హక్కు ఎవరికి లేదు. అపనమ్మకం ,అపోహలకు సాక్ష్యాలు ఉండవు. నేను రాసిన దానికి ధృవీకరించబడినా సాక్ష్యాలు ఉన్నాయి .గమనించి అంశం గురించి పూర్తిగా తెలిస్తే కామెంట్ చేయండి .

      Delete
  4. ఎవరు తప్పు చేసిన శి క్ష ఉంటే.వెంటనే అమలైతే సమాజం తప్పక బాగుపడుతుంది

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!