Popular posts from this blog
మనిషిలో తాత్వికత
మనిషిలో తాత్వికత (రామా చంద్రమౌళి గారి 'మనిషి పరిచయం' నవలా సమీక్ష) -శృంగవరపు రచన కథను చెప్పే నవలలు ఓ రకం.సంఘర్షణలను చెప్పే నవలలు ఇంకో రకం.మనం పొందలేని జీవితం గురించి చెప్పే నవలలు ఇంకో రకం.చరిత్ర పోరును చెప్పే నవలలు ఇంకో రకం.కానీ రణరంగమైన రాష్ట్ర అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంతో మనిషిని పరిచయం చేసే నవలలు అరుదు.అటువంటి నవలల్లో ఒకటే రామా చంద్రమౌళి గారి 'మనిషి పరిచయం.'.సమాజంలో వ్యక్తికి,పరిపాలకులకు,ఉద్యమాలకు మధ్య ఎంత దూరం ఉందో అంత దగ్గరితనము ఉంది.ఆ దూరాలు,దగ్గరలు మనుషులకు తమ నేలపై ఉన్న ప్రేమ,ఆ ప్రేమతో వచ్చే హక్కులు-బాధ్యతల నుండే జన్మిస్తాయి.తెలంగాణ రచయితల్లో రామా చంద్రమౌళి గారి శైలి విశిష్టమైనది.ఆయన ఆలోచనల్లోని తాత్విక చింతన ఆయన స్పృశించే ప్రతి అక్షరంలోనూ ప్రవహిస్తూ పాఠకులను తమ లోపలి మనిషిని చూసుకునేలా చేస్తుంది.'ఆవేశం-తాత్వికత' రెండు వ్యక్తి-సమాజ నిర్మాణానికి అవసరమే అయినా,ఏదీ ఎక్కువైనా వాటి వల్ల ఒనగూరే ప్రయోజనం శూన్యమవుతుంది.ఆలోచన లేని ఆవేశం,మనిషిని కార్య పరిణామాల గురించి ఆలోచింపచేయలేని తాత్వికత రెండు ప్రమాదకరమైన అస్త్రాలుగానే మారతాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పోరా...
డబ్బున్నవారి కథ
చదువరి డబ్బున్నవారి కథ -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) మనిషికి డబ్బు వల్ల వచ్చే అనధికార హక్కులు,ప్రత్యేకతల ప్రభావాన్ని గురించి స్పష్టం చేసే నవల కొడవటిగంటి కుటుంబరావుగారి ‘లేచిపోయిన మనిషి’నవల. ఈ నవలలో ప్రధాన పాత్ర యశోద.ఆమెకు తల్లి లేదు.తండ్రి చలమయ్య. ఆమె మేనమామ కాంతం. యశోదకు బాల్యంలో నారాయణ శాస్త్రితో పెళ్ళి అవుతుంది.అప్పటికి ఆమెకు పదేళ్ళు,భర్తకు పద్నాలుగేళ్లు.ప్రస్తుతానికి వస్తే పాతికేళ్లు వచ్చిన ఆమెకు అనుకోకుండా ఓ బంధువు వరసయ్యే ముసలమ్మ చనిపోవడంతో ముప్పై వేలు వస్తుంది. దానితో ఆమె హోదా సమాజంలో పెరుగుతుంది,యశోద కోరుకోకపోయినా. కాంతం మొదట ధనవంతుడు.అంతా విలాసాలకు ఖర్చు పెట్టి ప్రస్తుతం బికారిగా మారాడు. ధనవంతురాలైన మేనకోడలి ఆస్తిని ఎలా దక్కించుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. “ఇతరులను హీనంగా చూడటానికి, ఇతరులు చేయడానికి భయపడే పనులు ధైర్యంగా చేయడానికి నీకిప్పుడు కొంత అధికారం వచ్చిందన్న మాట.డబ్బు విలువ దాని దుర్వినియోగంలోనే ఉంది.నన్ను చట్టాలు తయారు చేయమంటే ఆదాయాల వారీగా నీతి,న్యాయమూ ఏర్పాటు చేస్తాను.”అంటాడు కాంతం యశోదతో. దీనిని బట్టి డబ్బు మనిషికి ఇచ్చే అన...



Comments
Post a Comment