మనిషిలో తాత్వికత (రామా చంద్రమౌళి గారి 'మనిషి పరిచయం' నవలా సమీక్ష) -శృంగవరపు రచన కథను చెప్పే నవలలు ఓ రకం.సంఘర్షణలను చెప్పే నవలలు ఇంకో రకం.మనం పొందలేని జీవితం గురించి చెప్పే నవలలు ఇంకో రకం.చరిత్ర పోరును చెప్పే నవలలు ఇంకో రకం.కానీ రణరంగమైన రాష్ట్ర అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంతో మనిషిని పరిచయం చేసే నవలలు అరుదు.అటువంటి నవలల్లో ఒకటే రామా చంద్రమౌళి గారి 'మనిషి పరిచయం.'.సమాజంలో వ్యక్తికి,పరిపాలకులకు,ఉద్యమాలకు మధ్య ఎంత దూరం ఉందో అంత దగ్గరితనము ఉంది.ఆ దూరాలు,దగ్గరలు మనుషులకు తమ నేలపై ఉన్న ప్రేమ,ఆ ప్రేమతో వచ్చే హక్కులు-బాధ్యతల నుండే జన్మిస్తాయి.తెలంగాణ రచయితల్లో రామా చంద్రమౌళి గారి శైలి విశిష్టమైనది.ఆయన ఆలోచనల్లోని తాత్విక చింతన ఆయన స్పృశించే ప్రతి అక్షరంలోనూ ప్రవహిస్తూ పాఠకులను తమ లోపలి మనిషిని చూసుకునేలా చేస్తుంది.'ఆవేశం-తాత్వికత' రెండు వ్యక్తి-సమాజ నిర్మాణానికి అవసరమే అయినా,ఏదీ ఎక్కువైనా వాటి వల్ల ఒనగూరే ప్రయోజనం శూన్యమవుతుంది.ఆలోచన లేని ఆవేశం,మనిషిని కార్య పరిణామాల గురించి ఆలోచింపచేయలేని తాత్వికత రెండు ప్రమాదకరమైన అస్త్రాలుగానే మారతాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పోరా...
Comments
Post a Comment