Posts

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

Image
                                  సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు                                                                  -శృంగవరపు రచన                                                        కథలు జీవితంలోని ఏ అంశాన్ని అయినా స్పృశించవచ్చు. కానీ ఆ కథల ద్వారా  జీవితం పట్ల ఎలా స్పందించాలో అన్న అంశాన్ని ఎలా కథలో మలుస్తారో అన్నదే రచయిత ముద్రను స్పష్టం చేస్తుంది. అటువంటి స్పష్టమైన ముద్రను కలిగిన రచయిత్రి లలితా వర్మ గారు. జీవితం పట్ల ఆశ,నమ్మకం కలిగేలా రాస్తూనే, జీవితంలోని అనేక సందర్భాల్లో విషాధం తలెత్తే తీరు తెన్నులను కూడా జీవిత ప్రక్రియలో భాగంగా ఎలా భావించాలో, పేదరికం-మధ్యతరగతి కుటుంబాల్లో తలెత్తే అనేక సమస్యలు ఎలా జీవితాలను అనేక రీతుల్లో మలుపులు తిప్పుతాయో చెబుతూనే, జీవితం చేజార్చుకోకూడదన్న సుతిమెత్తని హెచ్చరికను కూడా తన కథల్లో స్పష్టం చేశారు. ‘అరుంధతి@70’ అన్న కథా సంపుటిలో అనేక జీవితాలు మనకు తారసపడతాయి.        “నా చుట్టూ ఉన్న సమాజంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలకు చలించిన నా గుండె కరిగి ఒకానొకసారి కన్నీరై, మరొకసారి ఆనందభాష్పాలై స్రవించినప్పుడు వాటిని ఒడిసి గుప్పెట పట్టి అక్షర రూప

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

Image
      ఉద్యోగ పర్వంలో సగటు మనిషి                                                                                                       -శృంగవరపు రచన                                                           మ నిషి జీవితంలో కుటుంబాన్ని మించి ముఖ్య పాత్ర పోషించేది ఉద్యోగం.ఆశలతో తన జీవితాన్ని నిర్మించుకునే వ్యక్తికి జీవితపు అసలైన అర్ధాన్ని బోధపరిచేది ఉద్యోగమే.కుటుంబాన్ని ప్రేమించే మనిషికి బాధ్యతను నేర్పించేది ఉద్యోగమే.లోతుగా ఆలోచిస్తే వ్యక్తి తన కోసమే కాకుండా తన కుటుంబం కోసం పాటు పడే ధైర్యాన్ని ఇచ్చేది ఉద్యోగమే.ఈ సమాజంలోని మనుషులకు స్థిరమైన ఉద్యోగం లేకపోతే కుటుంబాలు ఎన్ని విచ్చిన్నమయ్యేవో! మనిషికి నచ్చినా నచ్చకపోయినా ఉద్యోగం ఉండటం అన్న అంశాన్ని అతని సామర్ధ్యానికి , బాధ్యతకు ప్రతీకగా భావించే సమాజ దృష్టి అనాది నుండి ఉంది. ఉద్యోగుల్లో అనేక రకాల మనుషులు ఉంటారు.కానీ సగటు భారతీయ ఉద్యోగికి పడే పాట్లు మాత్రం కొంత మేరకు ఉద్యోగాలు చేస్తున్న అందరూ తమ తమ స్థాయిల్లో అనుభవిస్తూనే ఉంటారు. అటువంటి ఓ ఉద్యోగి తన అనుభవాలను పంచుకునే క్రమాన్ని ‘ సగటు ఉద్యోగి ’ నవలగా శ్రీరాగి కలం పేరుతో రాశారు స్వర్

'వ్యాపార బంధాలు' నవలా సమీక్ష

Image
                                                            అవసరాల లోకంలో!                                                                                     -శృంగవరపు రచన                             మ నిషి బ్రతకడానికి డబ్బు అవసరం. డబ్బు లేకుండా ఏ పని జరుగదు. కానీ మనిషి ఆ అవసరం విషయంలో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడానికి సంకోచించడం ఎప్పటి నుండో జరుగుతూనే ఉంది. దానికి ముఖ్య కారణం డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్పవన్న భావన సమాజంలో ధృఢపడిపోవడం వల్ల. డబ్బు అవసరాల వరకు పరిమితమైతే దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు కానీ అది మనిషి నైతికతను , విలువలను , స్వధర్మాన్ని ప్రభావితం చేయగల సాధనంగా మారడం వల్ల డబ్బును ఏ అంశంతో ముడిపెట్టకూడదు అన్న భావజాలం ఉత్తమ మనిషిలో ఉంటుందనే నమ్మకం బలపడిపోయింది. పైకి డబ్బు గురించి చెప్పకపోయినా డబ్బు వల్ల భద్రత , అనుబంధాల సవ్యత ఉండటం కూడా గమనించవచ్చు. కానీ దానిని ఆర్థిక సంబంధంగా కాకుండా మనిషికి ఉండే స్వభావ మంచితనం వల్ల ఇవన్నీ ఏర్పడుతున్నాయని అనుకోవడంలో మనిషికి తన చుట్టూ ఉన్న మనుషులు-సమాజం మీద నమ్మకం బలపడుతుంది. ఆ నమ్మకం వల్లే మనిషి తనలో ఉండే

సదాచారం దురాచారమయ్యే క్రమంలో!

Image
  సదాచారం దురాచారమయ్యే క్రమంలో!          -శృంగవరపు రచన                                                         ఎ న్నో సార్లు సమాజం మనిషిని అనేక రూపాల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. వ్యక్తిగా సమాజంలో భాగం అయ్యే మనిషి తన జీవితంలో సమాజ ప్రభావం వల్ల సంతోషం కన్నా దుఃఖమే ఎక్కువగా ఉందని గమనించిన నాడు ఆ సమాజాన్ని లెక్క చేయకుండా బ్రతికితే తన జీవితం బాగుంటుందన్న భావనలో ఉంటాడు.అనేక సామాజిక సమస్యలు తలెత్తినప్పుడు మనిషి వాటిని ఎదుర్కునే క్రమంలో ఈ పద్ధతినే అవలంబించాడు. కానీ వ్యక్తికి సమాజాన్ని ఎదురీదే శక్తి ఎంత ఉన్నది అన్నదే ఆ అది దీర్ఘ కాలంలో ఆశయంగా నిలుస్తుందో లేకపోతే ఆ వ్యక్తిని సమాజమే మూకుమ్మడిగా నిర్వీర్యుడు అయ్యేలా చేస్తుందో అన్న విషయాన్ని నిర్ణయిస్తుంది. ఆ సమాజంలో పురుషుడితో సమానంగా స్త్రీ కూడా గుర్తింపు పొందుతున్నా  స్త్రీ కూడా అనేక సందర్భాల్లో తన జీవితాన్ని , అలవాట్లను , అభిరుచులను , ఆలోచనలను ప్రశ్నిస్తూ , వాటి మీద తన జడ్జ్ మెంట్స్ ద్వారా   నియంత్రించే   విధానాన్ని గుర్తించిన క్రమంలో తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలన్న తపనలో పురుషుడితో సంబంధాన్ని కేవలం ఇష్టం తప్

'చివరకు మిగిలేది' నవలా సమీక్ష

Image
జీవితమే శూన్యమేమో!        -శృంగవరపు రచన                                    కొన్ని రచనలు చదువుతుంటే ఆ రచయిత బహుశా ఆ రచనా సృజన కోసమే జన్మించారేమో అన్న భావన కలుగుతుంది. బుచ్చిబాబు గారు రాసింది   ‘ చివరకు మిగిలేది ’ అన్న ఒక్క నవలే అయినా , ఇంకా తాను చెప్పదల్చుకున్నది అంతకు మించి ఉండదేమో అన్నంత తీవ్రమైన సంఘర్షణ , ఆలోచనలు , అనుభూతులు , అనుభవాలను జీవిత వలయంలో గిరగిరా తిప్పుతూ , వాటిని ఓ గమనింపుతో చూస్తూ , జీవితం గురించి ఏదో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ , జీవితం అంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లో జీవిస్తూ , ఆ జీవితాన్ని జీవించడంలో సంతోషం లేదని , మనుషుల అనుబంధాలు-సంఘం కలిసి మనిషిలో జీవించాలనే కోరికను హత్య చేసే ప్రయత్నాన్ని గురించి , జీవితంలో చివరకు మిగిలేది ఏమి లేదని తేల్చడానికి రచన కథన పద్ధతి , సందర్భాలను , కథకుడి జీవితాన్ని , జీవితాన్ని ప్రభావితం చేసిన సంఘ నైతిక వలయాన్ని గురించి , జీవితానికి సంబంధించిన అనేక వాదనలను గురించి రచయిత రాసింది చదువుతుంటే , ఇదే కదా జీవితం అంటే అని పాఠకుడికి అనిపించడం వల్ల ఈ రచనలో పాఠకుడు తన జీవిత ఉద్దేశ్యాన్ని గురించి కూడా ఆలోచించుకునే ప్రయత్న

జీవితమే అనుభూతుల విందు!

Image
                                   జీవితమే అనుభూతుల విందు!                                                                                 -శృంగవరపు రచన                                              క థల ప్రయోజనం లోతైన  అర్ధాల్లో ఏదైనా కావచ్చు కానీ జీవితంలో సంతోషమో లేదా దుఃఖమో ఏమున్నా సరే , మనకే తెలియని మనకు సంతోషాన్ని కలిగిస్తూ కొంత నవ్వును ముఖం మీద జమయ్యేలా చేసే కథలకు లోతైన విశ్లేషణలు అవసరం లేదు ఎందుకంటే అవి గొప్ప అనుభూతుల భాండాగారాలు కనుక! జీవితంలో మధుర స్మృతుల గురించి , కొన్ని అంశాలను తలచుకోగానే హాస్యం , సంతోషం , జీవితానికి ఇది చాలు అనే భావాన్ని కలిగించే కథలే నేతి సూర్యనారాయణ శర్మ గారి ‘ శ్రీ దోస గీత ’ కథలు. ఇందులో మొత్తం 18 కథలున్నాయి.       మనిషి జీవితంలోని ప్రతి అంశాన్ని ఎంత సున్నితంగా , హాస్యంగా చూస్తూ , జీవితంలో సంతృప్తి పొందవచ్చో అన్న అంశాన్ని స్పష్టం చేసే కథలు ఇవి. ‘ భారతంలో పాఠోలి ’ కథలో పాఠోలి వంట ఎలా భీముడు వండాడో , దానికున్న సందర్భం ఏమిటో అన్న అంశాన్ని ఎంతో హాస్యంగా , వంటకు మన జీవితంలో ఉన్న పాత్రను స్పష్టం చేస్తూ రాశారు. ఇందులో కథల్లో కొన్ని జిహ్వాకు సంబంధిం

ముస్లిం జీవితం-భిన్న సామాజిక, వ్యక్తిగత కోణాలు!

Image
  ముస్లిం జీవితం-భిన్న సామాజిక , వ్యక్తిగత కోణాలు!          -శృంగవరపు రచన                                            ఈ ప్రపంచంలో మైనార్టీలుగా జీవించడం వాస్తవానికి నిరంతరం అభద్రతను కలిగిస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్య , మత సామరస్య దేశంగా చెప్పుకుంటున్న భారతదేశంలో గుజరాత్ లో 1992 డిసెంబర్ 6 న జరిగిన మారణకాండ , గోద్రా అల్లర్లో బలైన జీవితాలు ఈ దేశంలో ముస్లిం జీవితాల్లో ఉన్న దుఃఖాన్ని , వారి జీవించే హక్కు , గౌరవించబడే హక్కు హరించబడుతున్న విధానాన్ని స్పష్టం చేస్తూనే , ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తూ ఉంది. గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో పైన జరిగిన సామూహిక అత్యాచారంలో శిక్ష పడిన నిందితులను ఈ సంవత్సరం స్వాతంత్రదినోత్సవం నాడు విడుదల చేయడం , ఈ తీర్పుకి వ్యతిరేకంగా పిటిషన్ ఫైల్ చేసిన బిల్కిస్ భానో పిటిషన్ ను కోర్టు కొట్టేయ్యడం కూడా   మతం పేరిట జరిగే మారణకాండల పట్ల బాధితులకు ఇంకా భయాన్ని , అభద్రతను పెంచుతూనే ఉన్నాయి.              బా రహమతుల్లా గారి ‘ బహెన్ ’ కథాసంపుటిలో ముస్లింల జీవితాన్ని విభిన్న కోణాల్లో 12 కథల్లో స్పష్టం చేశారు. గుజరాత్ ఉదంతం తర్వాత ముస్లింల మానసిక