Posts

మార్పు పరిధి

Image
  మార్పు పరిధి -శృంగవరపు రచన (అన్వర్ గారి ‘జమీలా బాయి’ నవలా సమీక్ష) అన్వర్ గారి 'జమీలాబాయి' నవల స్త్రీవాద నవలగా నాకనిపించలేదు.'ఓ వేశ్య కాని వేశ్య' జీవితాన్ని ప్రభావితం చేసిన ఓ పురుషుడు ఇందులో ఉన్నాడు,ఆమె చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న సంకుచిత భావజాలం,మనిషి మంచితనానికి హద్దులు ఎందుకు ఏర్పడతాయో స్పష్టం చేసిన ఓ జీవన చిత్రం ఈ నవల. జీవితం గొప్పదా?మనిషి గొప్పవాడా? స్త్రీ గొప్పదా?పురుషుడు గొప్పవాడా?ఓటరు గొప్పవాడా?పాలకుడు గొప్పవాడా?వంటి ప్రశ్నలకు సిద్ధాంతపరమైన జవాబులకు,వాస్తవ కోణాలకు మధ్య వైరుధ్యముండే తీరుతుంది.ఎందుకీ వైరుధ్యత?ఎందుకు గొప్పతనాల ప్రదర్శనలు? అంటే మనిషి తన అవగాహన పరిమితి మేరకే తనను విస్తరించుకుంటూ,ఆ విస్తృతిలోనే అంతమైపోవడం వల్ల. ఆ విస్తృతి మనుషుల అహాలకు,విజయానుభవాలకు,పరాజయ ఉద్రేకాలకు చుట్టుకుని ఆ కేంద్రాన్ని దాటే మనుషులు,పరిస్థితులు ఎదురైనప్పుడు వాటికి దూరంగా పారిపోవడమో,లేక ఆ కొత్త పరిధిని కూడా కలుపుకోవడమో జరుగుతుంది.మనిషి జీవితంలో మూల మనస్తత్వాన్ని వారి విజయాలకనుగుణంగా మార్చుకున్నా సరే,మార్చగల మానసిక సత్తా ఉన్న మనుషులు ఎదురైనప్పుడు మారాల్సిందే,ఆ మార్పు ప్...

వినాశనంలో వ్యాపారం

Image
  వినాశనంలో వ్యాపారం -శృంగవరపు రచన (అమిరిశెట్టి గోపాల్ గారి ‘బెరెట్టా 606824’ నవలా సమీక్ష) తెలుగు నవలా సాహిత్యంలో చారిత్రక,పల్లె జీవన,రాజకీయ,నేర దృక్కోణ,మనోవిశ్లేషణ వర్గాల్లో ఎన్నో నవలలు వచ్చాయి. కానీ చరిత్ర అడుగుజాడల్లో నడుస్తూ అనేక సమకాలీన దృక్కోణాలను జోడించిన నవలలు అరుదు. ఇటువంటి ప్రక్రియలు రెండు ప్రపంచ యుద్ధాలు,ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సివిల్ వార్స్ సందర్భంగా ఎన్నో ఆంగ్ల నవలలుగా ,సినిమాలు గా వచ్చాయి. ప్రాంతీయ సాహిత్యంలో ఈ ప్రయోగాలు తక్కువ. అటువంటి వినూత్న ప్రయోగాత్మక అంశంతో తన మొదటి నవల ‘బెరెట్టా 606824’ ను రాశారు అమిరిశెట్టి గోపాల్ గారు. జాతి పిత మహాత్మా గాంధీను చంపిన ఆయుధంను కథలో ముఖ్య భాగం చేస్తూ, ఓ దేశభక్తుడు నాయకుడిగా, ఆ నాయకుడు కాలంలోకి ప్రయాణించగలిగే జాకెట్ ద్వారా మహాత్మాను కాపాడాలనుకోవడం,ఎన్నో యుద్ధాలలో అతను భాగం కావడం,ఆ ఆయుధం ఖండంతారాలు దాటడం వంటి అంశాల ద్వారా రచయిత ఈ నవలలో ఎన్నో వినూత్న కోణాలను ఆవిష్కరించారు. ప్రపంచంలో కొన్ని యుద్ధాలను పక్కనపెడితే,ఎన్నో యుద్ధాలు పాలకుల-దేశాల మధ్య ఉన్న అహాలు-ఇగోలు-మధ్యలోని అవకాశవాదత్వాల వల్లే జరిగాయి. అటువంటి యుద్ధం నేటి క...

అందుకున్న పుస్తకాలు

 సమీక్షల కోసం  వచ్చిన పుస్తకాలు  మార్చ్  ఉండవల్లి  1)నిశ్చల  2)గోభూమి  3)అంకితం  సింహాప్రసాద్  1)అంతర్యామి 2)డాలర్ ...డాలర్ , 3)మహారాజశ్రీ అవతారంగారు, 4)నువ్వో సగం నేనో సగం, 5)అభయం 6)ధిక్కారం 7)అభివందనం 8)నదీ నరుడు 9)అభి 10)కొత్త చిగురు 11)స్త్రీ పర్వం 12)వెలుగుల తీరం 13)గురి 14)తమ సోమా...! 15)జయహో రాజకుమార 16)నేను సైతం 17)నిండు నూరేళ్ళు 18)వెండి గిన్నెలో పాల బువ్వ 19)ఒక ఆడ+ఒక మగ 20)నైవేద్యం ఆదేళ్ళ శివకుమార్  1)ఆమె జయించింది  2)జీవితం మైనస్ ప్రేమ  3)నాకు టైం లేదు  4)లైఫ్ మేనేజ్మెంట్  ఆదేళ్ళ శైలబాల  1)వెనెల్లో గోదావరి  2)నాన్న  పసుపులేటి తాతారావు  1) ది ఛాయిస్  ఏప్రిల్  రామా చంద్రమౌళి  1)మొదటి చీమ  2)మనిషి పరిచయం  3)సూర్యుని నీడ  4)ఎక్కడి నుంచి ఎక్కడి దాకా  5)పరంపర ,ఎటు  డాక్టర్ తాళ్ళపల్లి యాకమ్మ  1)రక్షణ  2)కెరటం  3)జగడం-ఒక పరిశీలన  4)బోయ జంగయ్య సాహిత్యానుశీలన  జూలై  అర్నాద్  1)సత్య  2)ఈ తరం స్త్రీ  3)ఆపద్ధర్మం...

'ద సీక్రెట్' లో ఉన్న సీక్రెట్స్

Image
  'ద సీక్రెట్' లో ఉన్న సీక్రెట్స్ -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) మోటివేషనల్ పుస్తకాల కన్నా నేను నవలలు,కథలే ఎక్కువ చదువుతాను.మన జీవితాన్ని అవి మార్చేంత ప్రేరణ వాటిలో ఉందో,లేదో పక్కన పెడితే,అవి చదివి మారిపోయేంత శక్తి నాలో లేదనే నేను ఇన్నాళ్ళు నమ్మాననుకుంటా!అందుకే అందులో ఏమి గొప్ప అంశాలు ఉండవనే అనుకుంటూ, పూర్తిగా వాటిని పక్కన పెట్టేశాను.గత నెల రోజులుగా ఏమి చదవలేదు.ఏమి చదివే మూడు లేదు.కానీ నిన్న ఎందుకో నా అభిప్రాయాలను,నమ్మకాలను నేనే విభేదించి 'ది సీక్రెట్ ' చదవడం మొదలుపెట్టాను.ఇప్పుడే చదవడం పూర్తయ్యింది. జీవితంలో సాధారణ అంశాలు,తెలిసిన అంశాలే పాటించడం కష్టమని,అందుకే వాటిని సాధారణ అంశాలుగా మనమందరం కొట్టి పారేస్తాము కూడా.మనుషుల ఆలోచనలకున్న శక్తిని శాస్త్రీయ పద్ధతిలో చెప్పే పుస్తకమే 'ది సీక్రెట్.' ఇది 'లా ఆఫ్ అట్రాక్షన్'ను మన జీవితంలో అనుకున్నవి సాధించడానికి ఎలా ఉపయోగించాలో స్పష్టం చేసే పుస్తకం. మనం పదివేలు సంపాదించే జీతగాళ్ళమైతే మనకు ఏ నెల అయినా ఇరవై వేలు వస్తే గొప్ప సంతోషం.నెలకు రెండు వేలు కరెంట్ బిల్లు వచ్చేది వెయ్యి రూపాయలే వస్తే సంతోషిస్తాము.మన జ...

గర్భస్థ శిశువు ఘర్జన

Image
  చదువరి గర్భస్థ శిశువు ఘర్జన -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) మనకు తెలిసిన రచనలకన్నా తెలియని రచనలే అధికం.అటువంటి వాటిల్లో నాకిమధ్య దొరికిన అటువంటి నవలే గంగులనరసింహరెడ్డిగారి 'జీవనసమరం.' ఈ నవల బహుమతి పొందిన నవల.ఓ పత్రికలో ప్రచురితమైంది.బహుశా 1980 ల్లో అనుకుంటా.ముందు పేజీలు లేకపోవడం వల్ల ఆ పత్రికేమిటో తెలియలేదు. ఓ గర్భిణి జైలులో ప్రసవవేదన అనుభవిస్తూ ఉండటంతో ఈ కథ మొదలవుతుంది.ఆ సమయంలో నైతిక బాధ్యత తీసుకుని ఆమెను హాస్పటల్ కు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత ఆ జైలు సిబ్బందిదే అయినా ఎవరు లేని దేవమ్మను పట్టించుకోకపోగా ఆమె వేదనను చిరాకుగా భావించి ఆమెను ఇంకా వేదనకు గురి చేస్తారు.ఆమె కడుపులోని శిశువు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ శిశువు అక్క,తండ్రి,బాబాయి,అన్న ఆత్మలు ఆ శిశువును బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి.తన రక్త సంబంధీకులే తన జననానికి ఎందుకు అడ్డుపడుతున్నారో ఆ శిశువుకు అర్థం కాదు.అదే ప్రశ్నిస్తే ఈ సమాజం పేద వాళ్ళను బ్రతకనివ్వదని,తమ జీవితానికి విలువ లేదని ఆ శిశువుకు తమ కథలను చెప్తారు. మొదట ఆ శిశువు అక్క సీత తన కథ చెప్తుంది.ఆ రోజే ఆమెకు పెళ్ళి చూపులు.దాని కోసమన...

మగ స్నేహం

Image
  చదువరి మగ స్నేహం -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) మనిషి జీవితంలో ఎవర్ని ఇష్టపడినా,అది ఏ పరిస్థితుల్లో సంభవించినా సరే,వాటిని నిజాయితీగా భావించి ఆ జీవితపు పుటలను జీవితపు భాగస్వామితో పంచుకుంటే,అది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో స్పష్టం చేసే నవలే ఇచ్చావరపు జగన్నాథరావు గారి’ముళ్ళ గులాబీ’నవల. ఇది యువ మాసపత్రికలో ప్రచురించబడింది. రేఖ డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి మరణించాడు.తల్లి తన తమ్ముడైన ప్రకాశం చేతుల్లో కూతురిని పెట్టి మరణిస్తుంది. అక్క ఆస్తిని కబళించడమే కాకుండా రేఖ జీవితాన్ని కూడా నాశనం చేసే తరుణంలో ఆమె తన తండ్రి స్నేహితుడైన నరసింహారావుగారి సాయంతో అక్కడి నుండి బయటపడి పట్టణానికి వెళ్తుంది. అక్కడ నరసింహరావుగారి కూతురైన మాలతితో కలిసి ఉంటుంది. ఎలాగో ఓ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఆ కంపెనీ యజమాని జీవన్. జీవన్,రేఖాల మధ్య అభిమానం చిగురించింది. జీవన్ భార్య సవిత. ఆమె ఆస్తి వల్లే జీవన్ ధనవంతుడయ్యాడు. ఆ మాట మీదే అతన్ని సవిత సాధిస్తూ ఉంటుంది.జీవన్ కు.రేఖకు మధ్య శారీరక సంబంధం ఉండకపోయినా మానసిక సామీప్యత ఉన్నట్టే రేఖ భావిస్తుంది. పెళ్ళయిన అతనితో తనకున్నది స్నేహమే కనుక దానిని ఆమ...

చావు రాజకీయం

Image
  చదువరి చావు రాజకీయం -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) దేశంలో కాశ్మీర్ సమస్య ఎందుకు ఎంతో తెలివైన వారు ఉన్నప్పటికీ కూడా ఎందుకు పరిష్కారం కాలేదు అని అడిగిన ప్రశ్నకు దేశంలో ఏ సమస్య అయితే లాభకారిగా ఉంటుందో అది ఎప్పుడు పరిష్కరించకుండానే ఉంటుంది అని అయ్యారే సినిమాలో నాయకుడు జవాబిస్తాడు. వాస్తవానికి మన సమాజంలో ప్రతి ఒక్క సమస్య ఏదో ఒక వర్గానికి లాభాన్ని చేకూరిస్తూనే ఉంటుంది.అలా ఓ గూడెంలో ఓ ఆడపిల్ల సమస్య రాజకీయ లబ్దికి ఓ పావులా ఉపయోగపడిందో స్పష్టం చేసే నవలే కాకాని కమల గారి ‘ నిశాని.’ఈ నవలకు ఆంధ్రభూమి పొట్టి నవలల పోటీల్లో బహుమతి లభించింది. ఆ గూడెంలోని ఓ కుటుంబ పెద్ద రామయ్య. అతని భార్య మల్లమ్మ. వారి కూతురు పదహారేళ్ళ వరలక్ష్మి. కొడుకు పదేళ్ళ చంద్రం. ఇంకో పిల్లవాడు ఏడాది వయసున్న వాడు. రామయ్య ఓ బిజీ సినిమా సెంటరు దగ్గర బజ్జీ బండి నడుపుకుంటూ ఉండేవాడు.అతనికి అక్కడ పోటీగా ఇంకే బండి రాకుండా అటు ఆ సినిమా హాలు యజమాన్యానికి,ఇటు పోలీసులకు లంచాలు ఇచ్చి తన బజ్జీ బండికి గిరాకీ పెరిగేలా చూసుకున్నాడు. రాములు భార్య మల్లమ్మ అయిదిళ్ళల్లో పాచి పనులు చేస్తూ ఉంటుంది.అలా వారిద్దరి సంపాదనన...