నిగ్రహ సాధన
నిగ్రహ సాధన -శృంగవరపు రచన మనిషికి తెలిసి జరిగేవి, తెలియకుండా జరిగేవి, జరిగిపోతే తప్ప అర్ధం కానివి అని మూడు రకాలుగా జీవితం విభజించబడి ఉందో లేకపోతే మనిషికి తెలిసినా గుర్తించే చైతన్యం మనిషిలో లోపించడం వల్ల మనిషి మనశ్శాంతిని కోల్పోతున్నాడో తెలియని సంఘర్షణను ఆధ్యాత్మిక సాధన కోణంలో స్పష్టం చేయడానికి ప్రయత్నం చేసిన నవల శ్రీమతి శుభ గారి 'చిరుదివ్వెను వెలిగిద్దాం రండి!' ఈ నవలలో కాస్త సందిగ్దంగా జీవితం ఉన్నప్పటికి కూడా కొంతమేరకు ఆలోచింపజేసే ప్రయత్నం చేసిన నవల అది. ఈ నవలలో ముఖ్య పాత్రలు సుధీర,ఆమె స్నేహితురాలు మాధవి. సుధీర అన్నయ్య సౌజన్య. సుధీర తల్లిదండ్రులు వరలక్ష్మి,రామారావు.సుధీర కొంచెం దుడుకైన స్వభావం కల అమ్మాయి.ఓ రోజు మాధవితో కలిసి సినిమాకు వెళ్తుంది సుధీర. అక్కడ హాల్లో పోకిరి కుర్రాళ్ళూ నలుగురు వారిని అల్లరి చేసినప్పుడు సుధీర వారిలో ఒకతన్ని సూదితో గుచ్చుతుంది. ఆ తర్వాత హాలు బయట వారు అల్లరి చేసే ప్రయత్నం చేస్తే వారిని ఎదిరించి ధైర్...